రెండు రోజుల పర్యటనలో 18 న ఉండవల్లిలోని సీఎం చంద్ర బాబు నివాసంలో అమిత్ షా భేటీ అవుతారు.
19న ఉదయం అమిత్ షా కృష్ణా జిల్లా, గన్నవరం సమీపం లో నిర్మించిన ఎన్ఐడీఎం కేంద్రం, ఎన్డీఆర్ఎఫ్ పదో బెటాలియన్ను ప్రారంభిస్తారు.
సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు రామ్మోహన్నాయుడు, బండి సంజయ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ప్రారంభోత్సవం తర్వాత బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు హోంమంత్రి అమిత్ షా.
ఇక ఇటీవలె ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏపీలో పర్యటించిన సంగతి తెలిసిందే. రూ.2 లక్షల కోట్లతో చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.


ప్రభుత్వ ఆస్తుల రక్షణ బాధ్యత గవర్నర్ దే: రేవంత్ రెడ్డి