యాంకర్ శివ జ్యోతి, ఇటీవల ఆమె తిరుమల శ్రీవారి ప్రసాదంపై చేసిన కామెంట్స్ నేపథ్యంలో టీటీడీ (TTD) సంచలన నిర్ణయం తీసుకుంది.
భవిష్యత్లో ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకోకుండా ఆధార్ కార్డ్ను బ్లాక్ చేసింది.
ప్రసాదంపై శివజ్యోతి వ్యాఖ్యలు వైరల్ కావడంతో ఆ తర్వాత క్షమాపణలు చెబుతూ వీడియోను రిలీజ్ చేసింది. అయినా, టీటీడీ క్షమించకుండా చర్యలు చేపట్టింది.
ఇటీవల శివ జ్యోతి తమ్ముడు సోషల్ మీడియాలో తిరుమల లడ్డూ ప్రసాదం నాణ్యత, ధరపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలు క్షణాల్లో వైరల్ కావడంతో శ్రీవారి భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్న ఫిర్యాదులతో స్పందించిన టీటీడీ విజిలెన్స్ విభాగం, ఈ ఘటనపై విచారణ చేపట్టింది.
అనంతరం సమావేశమైన టీటీడీ బోర్డు, శివ జ్యోతి ఆధార్ను బ్లాక్ చేయాలని నిర్ణయించింది.
ఈ నిర్ణయంతో ఆమె ఎలాంటి దర్శన టికెట్లు పొందలేని పరిస్థితి ఏర్పడుతుంది. తిరుమల అన్న ప్రసాదంపై చేసిన కామెంట్స్తో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
వివాదం ముదురుతుండటంతో శివ జ్యోతి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. “మా తమ్ముడి వ్యాఖ్యల వల్ల ఎవరి మనోభావాలైన దెబ్బతిని ఉంటే, క్షమించండి.
మా కుటుంబ సభ్యులు ఎప్పటికీ శ్రీవారి భక్తులే” అని పేర్కొంటూ ఆమె క్షమాపణలు చెప్పారు.


ఐదేళ్లలో జరగని అభివృద్ధి ఐదు నెలల్లో జగన్ చేశారు: మంత్రి అవంతి