telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ అసెంబ్లీ సమావేశాల 17 రోజుల పాటు నిర్వహించాలని బీఏసీ సమావేశం లో ప్రభుత్వ నిర్ణయిం

శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన నేడు జరిగిన శాసన వ్యవహారాల సలహా సంఘం (BAC) సమావేశానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హాజరయ్యారు.

రాష్ట్ర ఆర్ధిక, శాసన వ్యవహారాల శాఖ మంత్రి  పయ్యావుల కేశవ్, పౌరసరఫరాల శాఖ మంత్రి  నాదెండ్ల మనోహర్ (జనసేన), చీఫ్ విప్  జీవీ ఆంజనేయులు (తెలుగుదేశం) ఎమ్మెల్యే  విష్ణుకుమార్ రాజు (బీజేపీ) సంబంధిత అధికారులు కూడా పాల్గొన్నారు.

ఏపీ అసెంబ్లీ సమావేశాల వేళ ప్రభుత్వం వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశాల వేదిక గా ప్రస్తుతం కీలకంగా మారిన అన్ని అంశాల పైన చర్చించి . ప్రజలకు స్పష్టత ఇవ్వాలని నిర్ణయించారు.

అదే విధంగా పాలనా పరంగానూ కీలక నిర్ణయాలు ప్రకటించనుంది. గవర్నర్ ప్రసంగం పూర్తయిన తరువాత బీఏసీ సమావేశం జరిగింది. ఈ సారి సమావేశాలను 17 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు.

ఈ నెల 14న ప్రభుత్వం సభలో 2026-27 వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది. ఆ తరువాత 15,16 తేదీలు శివరాత్రి  ఆ మరుసటి రోజు సెలవు ప్రకటించారు. 17, 18 తేదీల్లో బడ్జెట్ పైన చర్చ జరగనుంది. 18న బడ్జెట్ పై ఆర్దిక మంత్రి సమాధానం ఇవ్వను న్నారు.

వరుసగా ఎనిమిది రోజుల పాటు బడ్జెట్ పద్దుల పైన శాఖల వారీగా చర్చించి కేటాయింపులు  ప్రాధాన్యతలు వివరించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ సమావేశాల్లో ప్రభుత్వం ఆరు ఆర్డినెన్స్ లకు ఆమోదం తెలపనుంది.  ఫిబ్రవరి 24,25,26 తేదీల్లో ఎమ్మెల్యేలకు ఆటల పోటీలు నిర్వహణకు బీఏసీలో నిర్ణయం జరిగింది.

మార్చి 1,2,3 తేదీల్లో సెలవు ప్రకటించారు. ప్రతీ రోజు ఉదయం 9 నుంచి 2 గంటల వరకు సభ నిర్వహించనున్నారు.

అదే విధంగా తప్పని సరిగా సమావేశాల్లో ప్రతీ రోజు 10 గంటలకు జీరో అవర్ నిర్వహించాలని,  అవసరమైతే పొడిగించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

ఇక, సమావేశాల ముగింపు రోజు మార్చి6న అమరావతి లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణకు స్పీకర్ నిర్ణయించారు.

ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమంతో పాటుగా ప్రతిష్ఠాత్మక కార్యక్రమాల గురించి సభా వేదికగా ప్రజలకు వివరించాలని భావిస్తున్నారు.

తాజా వివాదాలు  ప్రభుత్వం పైన వస్తున్న విమర్శలకు అసెంబ్లీ నుంచే స్పష్టత ఇవ్వనున్నారు. మెడికల్ కాలేజీలతో సహా  రుషికొండ పైనా సభలో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Related posts