తెలంగాణలో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత 24 గంటల్లో ఏకంగా 2,511 కేసులు వెలుగుచూశాయి. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 1,38,395కు పెరిగింది. నిన్న ఒక్క రోజే 11 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 877కు చేరుకుంది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 305 కేసులు వెలుగుచూశాయి. ఇక, కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య కూడా భారీగా ఉండడం ఊరటనిచ్చే విషయం. నిన్న ఒక్క రోజే 2,579 మంది కోలుకున్నారు. వీరితో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,04,603 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
రాష్ట్రంలో ఇంకా 32,915 కేసులు యాక్టివ్గా ఉన్నట్టు వైద్య ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది. నిన్న రాష్ట్రవ్యాప్తంగా 62,132 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల సంఖ్య 16,67,653కు పెరిగింది.

