విజయవాడలో రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా తయారయిందని టీడీపీ నేత, విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని ఈరోజు ట్విట్టర్ లో వివరించారు. దీనివల్ల నగరవాసులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. విజయవాడ నగరంలో రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా తయారయిందని కేశినేని తెలిపారు.
ఈ రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయించాలని సీఎం జగన్ ను కోరారు. విజయవాడ పాలఫ్యాక్టరీ వద్ద ఉన్న చనమోలు వెంకట్రావు పైవంతెన ఫొటోతో ప్రచురితమైన ఓ పత్రికా కథనాన్ని ఈ ట్వీట్ కు కేశినేని జతచేశారు. తన ట్వీట్ కు ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో పాటు విజయవాడ మున్సిపల్ కమిషనర్ ను కేశినేని ట్యాగ్ చేశారు.


శ్రీవారి లడ్డూతో వ్యాపారం చేయడం తప్పు: రమణ దీక్షితులు