తమిళ స్టార్ హీరో సూర్య సినిమాలే కాదు శివకుమార్ విద్యా ట్రస్ట్, అగరం ఫౌండేషన్ ద్వారా తన శక్తి మేర సమాజ సేవ కూడా చేస్తున్నారు. అందులో భాగంగా శివకుమార్ విద్యా ట్రస్ట్, అగరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతిలో ప్రథమ స్థానంలో ఉతీర్ణత సాధించిన పేద విద్యార్థులకు ఆర్ధిక సాయం అందించారు హీరో సూర్య. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న కొత్త విద్యా విధానంపై ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. నీట్ విధానాన్ని సూర్య తప్పుబట్టారు. కేంద్ర ప్రభుత్వ విద్యావిధానంపై ఆయన తన ట్విట్టర్లో ఓ పోస్ట్ కూడా చేశారు. అయితే సూర్య వ్యాఖ్యలను బీజేపీ నేతలు తప్పు పట్టగా… ఆయన సన్నిహితులు మాత్రం స్వాగతించారు. మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్హాసన్ సూర్య మాట్లాడిన దాంట్లో తప్పేంటంటూ సూర్యకు తన మద్దతుని తెలియజేశారు. ఈ నేపథ్యంలో సూర్య సతీమణి జ్యోతిక లేటెస్ట్ మూవీ “రాక్షసి” సినిమాను ఆందోళనకారులు అడ్డుకున్నారు. దీంతో సూర్య ఓ భావోద్వేగ లేఖను రాసి ట్విట్టర్ వేదికగా రాశారు. ఆ లేఖలో “ప్రతి పేదవాడికీ విద్యనభ్యసించే హక్కు ఉంది. అలాగే భారతీయ పౌరుడిగా నాకు మాట్లాడే హక్కు ఉంది. విద్యా వ్యవస్థలో ఉన్న ఇబ్బందులు గురించి మాట్లాడితే తప్పేంటి.. నన్ను టార్గెట్ చేయడం నాకు బాధను కలిగించింది” అని సూర్య పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం సూర్య కేవీ ఆనంద్ దర్శకత్వంలో “కాప్పాన్” అనే భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆర్య, మలయాళ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్నారు.ఆగస్ట్ 15న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
previous post