సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిలపై అనేక కేసులున్నాయని టీడీపీ ఎంపీ కనకమేడల అన్నారు. తీవ్ర నేరాలు ఉన్నవారిపై ఏడాదిలో విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని తెలిపారు. సుప్రీం ఆదేశాల మేరకు వారిద్దరూ నిర్దోషులుగా నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.ఓవైపు అమరావతి ప్రాంతంలో భవనాల నిర్మాణం కొనసాగుతోందని, మరోవైపు, ప్రభుత్వ ప్రకటనలు ప్రజలను గందరగోళానికి గురి చేసేలా ఉన్నాయని విమర్శించారు.
ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఏదేదో ఊహించుకుని అసెంబ్లీలో ఇలాంటి ప్రకటనలు చేయవచ్చా? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి మూడు రాజధానులు రావచ్చేమో అంటూ జగన్ చేసిన ప్రకటనను ఆయన తప్పుపట్టారు. వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని అన్నారు.


మూడు రాజధానులపై బొత్స ఆసక్తికరవ్యాఖ్యలు..