వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఇసుక విధానం పై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. మంగళవారం కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ బస్తా సిమెంట్ కన్నా ఇసుక ధర ఎక్కువగా ఉండడం.. జగన్నాటకమేనని అన్నారు. వైసీపీ నేతల ఇసుక దోపిడీ జగన్కు తెలియడంలేదా? అని ప్రశ్నించారు. గోదావరి, కృష్ణ అనుసంధానాన్ని రివర్స్ చేస్తున్నారని, జలాశయాలు ఎందుకు నింపలేదని సీఎం ఇప్పుడు ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందని చంద్రబాబు ఎద్దేవా చేశారు.
టీడీపీ నేతలపై తప్పడు కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే వంశీ విషయంలో కూడా ఇదే జరిగిందన్నారు. వంశీని లొంగదీసుకోవాలనో, దెబ్బతీయాలనో.. కావాలనే ఆయనపై తప్పుడు కేసులు పెట్టారని చంద్రబాబు ధ్వజమెత్తారు. తాను ఇలాగా ఆలోచించి ఉంటే వైసీపీ నేతలు ఒక్కరైనా రోడ్డుమీదకు వచ్చేవాళ్లా అని చంద్రబాబు అన్నారు. తప్పడు కేసులు పెట్టిన ప్రతి ఒక్కరికీ శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు.

