దావోస్ పర్యటన ముగించుకుని అమరావతి చేరుకున్న సీఎం చంద్రబాబు.
మంత్రులు అనగాని, అనిత, కొల్లు, సవిత, పార్థసారథి – సీఎంకు స్వాగతం పలికిన ఎమ్మెల్యేలు భాష్యం ప్రవీణ్, గద్దె రామ్మోహన్, యార్లగడ్డ వెంకట్రావు, వర్ల కుమార్ రాజా, కాగిత కృష్ణప్రసాద్, వసంత కృష్ణప్రసాద్ సీఎంకు స్వాగతం పలికారు.
దావోస్ పర్యటన ముగించుకుని ఇవాళ ఏపీకి చేరుకున్న సీఎం చంద్రబాబు నేరుగా ఎస్ఎల్బీసీకి ముఖ్యమంత్రి హజరైనారు.
వార్షిక రుణ ప్రణాళిక అమలుపై సమీక్ష సహా వివిధ అంశాలపై చర్చించనున్న ఎస్ఎల్బీసీ. ఎంఎస్ఎంఈలు, వ్యవసాయ రుణాలపై సమీక్షించనున్న సీఎం.
వార్షిక రుణ ప్రణాళికలో భాగంగా ఇప్పటి వరకు వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ. 2.96 లక్షల కోట్ల మేర రుణాలు ఇచ్చిన బ్యాంకర్లు.
కౌలు రైతులకు రూ. 1490 కోట్ల మేర వ్యవసాయ రుణాలు అందజేత. ఎంఎస్ఎంఈలకు రూ. 95,714 కోట్ల మేర రుణాలు జారీ చేసిన బ్యాంకర్లు.
అమరావతి ఫైనాన్షియల్ హబ్ చేసే అంశంపై చర్చించనున్న ముఖ్యమంత్రి. రాజధానిలో సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ అంశంపై బ్యాంకర్లతో సమాలోచనలు.
ఏపీ టిడ్కో రుణాలు, డ్వాక్రా సంఘాల లింకేజీ, కేంద్ర పథకాలకు బ్యాంకుల సహకారం, స్టార్టప్ లకు సహకారం వంటి అంశాలపై సీఎం సమీక్ష.
సమావేశానికి హజరైన మంత్రులు పయ్యావుల కేశవ్, కొండపల్లి శ్రీనివాస్, సీఎస్ విజయానంద్, యూనియన్ బ్యాంక్ ఎండీ, ఆర్బీఐ ప్రాంతీయ డైరెక్టర్, నాబార్డు జీఎం
ఎస్ఎల్ బీసీ సమావేశానికి హాజరైన వివిధ బ్యాంకులకు చెందిన ప్రతినిధులు, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ డైరెక్టర్లు.
గోదావరి పుష్కరాల నిర్వహణపై సాయంత్రం సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.

