తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా మంథని మీదుగా భూపాలపల్లి వెళుతున్న ఆర్టీ బస్సు బోల్తా పడింది. సోమన్పల్లి వంతెన వద్ద బస్సు బస్సు అదుపు తప్పింది. గోదావరి ఖని డిపోకు చెందిన ఈ బస్సులో 63 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనలో 25 మంది ప్రయాణీకులు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప మహదేవ్పూర్ ఆసుపత్రికి ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడంవల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణీకులు తెలిపారు. డ్రైవర్ గుడ్కా వేసుకుంటూ స్టీరింగ్ను వదిలేయడంతో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ పరారయ్యాడు.

