* ఆగివున్న లారీ కిందికి దూసుకెళ్లిన కారు
* ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి దుర్మరణం
* మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
* క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలింపు..
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉలిందకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్ లారిని ఢీకొట్టంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
మృతులు ఒకే కుటుంబానికి చెందిన శ్రీనివాసులు, భాగ్యలక్ష్మీ, ఆదిలక్ష్మీలగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన ఆంజనేయులు, ధరణి, కుమార్లను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ధర్మవరానికి చెందిన కుటుంబం కర్నూలకు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

మరోచోట.. కర్నూలు జిల్లాలో ఓ ట్రావెల్స్ బస్సు, బొలెరో వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. బస్సులో ప్రయాణిస్తున్న 15మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీంచారు.

