ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర మంత్రిగా శ్రీ మహమ్మద్ అజారుద్దీన్ గారి పదవీ స్వీకార ప్రమాణ కార్యక్రమానికి హాజరయ్యారు.
 
 
రాజ్భవన్ దర్బార్ హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ గారు మహమ్మద్ అజారుద్దీన్ గారితో ప్రమాణం చేయించారు.
నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్ గారికి ముఖ్యమంత్రి గారు అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, శాసనసభ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారితో పాటు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.


