telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మల్లన్న భక్తుల పై లాఠీ ఛార్జీ చేయడం పై ఎపి బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్ సీరియస్ గా స్పందించారు

శివ మాలధారులపై శ్రీశైలం లో లాఠీ ఛార్జ్ చేయడం పై ఎపి బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్ సీరియస్ గా స్పందించారు.

ఎడిషనల్ ఎస్పీ లాఠీ ఛార్జ్ చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. శైవ భక్తులు పట్ల సంయమనం పాటించాలని అధికారులు కు హితవు పలికారు.

మాల ధారణ చేసి న భక్తులు శ్రీశైలం లో ఇరుముడులు సమర్పిస్తారు.వారికి సహకరించాల్సిన యంత్రాంగం సంయమనం కోల్పోతే ఎలా అని మాధవ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

శ్రీ శైలం దేవాలయం పాలకమండలి తగు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ మేరకు బిజెపి రాష్ట్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు.

Related posts