డైరక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి 20 సంవత్సరాలు పూర్తి అయ్యింది. పవర్స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన బద్రి సినిమా ద్వారా దర్శకుడిగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన పూరీ 34 సినిమాలను తెరకెక్కించారు.అగ్ర హీరోలందరితోనూ ఆయన పనిచేశారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ అనే సినిమాకు పూరీ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా సినిమా ఇండస్ట్రీలో పూరీ 20 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో పలువురు ఆయనకు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అభినందనలు తెలియజేస్తున్నారు. సినీ ప్రముఖులందరూ ఆయనకు అభినందనలు చెబుతున్నారు. కరణ్ జోహార్, రామ్ పోతినేని, అనూప్ రూబెన్స్, నిధి అగర్వాల్ తదితరులు పూరీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో వారికి థ్యాంక్స్ చెప్పారు ఈ దర్శకుడు. ఈ సందర్భంలో రామ్ ట్విట్టర్ ద్వారా ‘‘సినిమా ఒక కళ. ఆ కళను మీరు పొందారు. ఊపిరిగా జీవిస్తున్నారు. మీ తుది శ్వాస వరకు సినిమానే ఊపిరిగా ఉండాలని మా కోరిక” అని అభినందనలు తెలిపారు. హీరో రామ్ చేసిన ట్వీట్కు స్పందించిన పూరీ నా ఊపిరి ఆగిపోయేవరకు సినిమాలకే అంకితం అవుతా అని కామెంట్ చేశారు.
previous post

