పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి మండిపడ్డారు. గురువారం బెంగాల్లోని బంకూరలో జరిగిన ప్రచార ర్యాలీలో మోదీ మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో ఓటమి తప్పదనే ఆందోళనతో ఆమె రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీదీ తనను దేశ ప్రధానిగా అంగీకరించనని బాహాటంగా చెబుతున్నారని అయితే ఆమె పాకిస్తాన్ ప్రధానిని మాత్రం గుర్తిస్తారని చురకలు వేశారు.
తనను దేశ ప్రధానిగా అంగీకరించనని ఆమె చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగాన్ని అవమానించడమేనని వ్యాఖ్యానించారు. ప్రదాని మోదీ ఫొని తుపాన్ ప్రభావంపై తాను బెంగాల్ సీఎంతో మాట్లాడాలని ప్రయత్నించినా ఆమె నుంచి సమాధానం లేదని చెప్పుకొచ్చారు. బెంగాల్కు మేలు చేయడం పట్ల ఆమెకు ఆసక్తి లేదని ఆరోపించారు.


చంద్రబాబు, జగన్ దొందూ దొందే: సీపీఐ నారాయణ