అంతర్జాతీయంగా పాక్ పై ఉగ్రవాద శిబిరాల ధ్వంసం గురించి ఒత్తిడి పెరగడంతో.. రోజుకో నాటకానికి ఆ దేశం తెరతీస్తోంది. జైషే సంస్థ అధినేత మృతిచెందాడని మొన్నటిదాకా ప్రచారం చేసుకున్న పాక్ నేడు 182 మదర్సాలను నియంత్రణలోకి తీసుకున్నామని… నిషేధిత సంస్థలకు చెందిన 121 మందిని అరెస్ట్ చేశామని పాక్ ప్రభుత్వం ఈరోజు తెలిపింది. తమ దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగానే తాము ఇదంతా చేశామని… భారత్ ఆగ్రహం వ్యక్తం చేసిందన్న కారణంతో కాదని పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ వ్యాఖ్యానించింది.
పాకిస్థాన్, మదర్సాల విషయంలో ఏం చేయాలనేది ఇప్పుడు ఒక సవాల్ గా పరిణమించిందని చెప్పుకోవడం విశేషం. యువతలో రాడికల్ భావజాలాన్ని మదర్సాలు నింపుతున్నాయనే ఆరోపణలు ఇటీవలి కాలంలో ఆ దేశంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరోవైపు పేద దేశమైన పాక్ లో లక్షలాది పేద విద్యార్థులకు విద్యను అందిస్తున్నది కూడా మదర్సాలే.