telugu navyamedia
National రాజకీయ వార్తలు

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్న విపక్షాలు

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధం

ఇప్పటికే 103 మంది ఎంపీల సంతకాల సేకరణ!. మాట్లాడేందుకు విపక్ష నేత రాహుల్‌గాంధీకి అవకాశం ఇవ్వకపోవడం,  ఎనిమిది మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు వేయడం,  కాంగ్రెస్ మహిళా ఎంపీలపై బీజేపీ ఎంపీ నిరాధార ఆరోపణలు తదితర కారణాలతో అవిశ్వాసాన్ని తెరపైకి తెచ్చిన విపక్షాలు.

లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు సమర్పించడంపై ఇవాళ నిర్ణయం తీసుకోనున్నారు. సభలో ప్రతిష్టంభన తొలగింపుపై స్పీకర్‌తో రాహుల్, మరికొందరు ఎంపీల సమావేశం కానున్నారు.

రాహుల్ ఒక్కరే మాట్లాడి మిగిలినవారికి అవకాశం కల్పించకపోతే కుదరదంటున్న ప్రభుత్వం స్పీకర్‌పై అవిశ్వాసం ప్రవేశపెట్టినా విపక్షాలకు బలం లేదన్న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు.

Related posts