అల్లరి నరేష్ తన సినీ కెరీర్లో ఎక్కువ శాతం సినిమాల్లో హాస్య పాత్రనే ఎంచుకున్నాడు. అతి తక్కువగా వేరే తరహా సినిమాలను తెరకెక్కించాడు. వాటిలో నేను, విశాఖ ఎక్స్ప్రెస్ వంటి సీరియస్ పాత్రలను కూడా అలవోకగా చేసిన తన నటన విశ్వరూపాన్ని చూపించాడు. అయితే తాజాగా అల్లరి నరేష్ చేసిన సినిమా బంగారు బుల్లోడు. ఇది కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కింది. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ప్రసాదించలేదు. దీంతో నరేష్ ఫ్లాప్ల ఖాతాలో మరో సినిమా చేరింది. బంగారు బుల్లోడు బాక్సాఫీస్ వద్ద ఎంతలా చతికిల పడిందంటే వారాంతాల్లో కూడా వసూళ్లు చేయలేకపోయింది. కానీ నిజానికి నరేష్ కూడా బంగారు బుల్లోడు సినిమాపై పెద్దగా ఆశలు పెట్టుకున్నట్లు కనిపించలేదు. విజయ్ కనకమేడల చిత్రానికి దర్శకత్వం వహించారు. సతీశ్ వేగేశ్న నిర్మిస్తోన్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ లాయర్ గా కనిపించనుంది. ఈ సినిమాను ఫిబ్రవరి 19న విడుదల చేయనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ప్రయోగాత్మక చిత్రాలతో ఆకట్టుకునే నరేష్ ఇపుడు ‘నాంది’ డిఫరెంట్ స్టోరీ సినిమాతో వస్తున్నాడు. సినిమా ఫస్ట్ లుక్ తోనే ఆడియెన్స్ ని ఆకట్టుకున్నాడు. ఇది ఇలా ఉంటే… ఈ మూవీ ట్రైలర్ ఇవాళ రిలీజ్ అయింది. ప్రిన్స్ మహేష్బాబు చేతుల మీదుగా నాంది మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఇక ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటుంది. “అందరూ నా జీవితం ఇక్కడ అయిపోయింది అని అనుకుంటారు.. కానీ ఇప్పుడే మొదలైంది” అంటూ ట్రైలర్లో అల్లరి నరేష్ ఇరగదీశాడు. ఇక మూవీ ఏ రేంజ్లో ఉంటుందో తెలియాలంటే రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.
previous post
next post