ప్రముఖ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ శశికుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గురువారం ఉదయం ఆయనకి గుండెనొప్పి రావడంతో బంజారాహిల్స్లోని ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ఆయన ఆరోగ్యం పరిస్థితి విషమంగా ఉండటంతో హార్ట్కి స్టంట్స్ వేసినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు బాగానే ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. శశి ప్రీతమ్, జేడీ చక్రవర్తి, మహేశ్వరి నటించిన రొమాంటిక్, యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “గులాబి”తో సింగర్గా టాలీవుడ్లో అడుగు పెట్టారు శశి. ఆ సినిమా మంచి విజయం సాధించింది. దీంతో ఆ తర్వాత 21 తెలుగు సినిమాలకు, ఆరు హిందీ సినిమాలకు సంగీతం అందించారు శశి ప్రీతమ్. సినిమాలతో పాటు వీడియో డాక్యుమెంటరీలు, యాడ్స్ కూడా ఆయన రూపొందించారు.
previous post

