telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

జర్నలిస్టు కాల్చివేత… ఐదుగురి అరెస్టు

Vikram Joshi

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ లో కొందరు దుండగులు జర్నలిస్టును కాల్చిచంపారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీస్ సూపరింటెండెంట్ కళానిధి నైత్వాని మంగళవారం తెలిపారు. విజయ నగర్ కు చెందిన విక్రమ్ జోషి అనే జర్నలిస్టు తన మేనకోడలిని కొందరు దుండగులు వేధిస్తుండటంతో ఇటీవల స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అప్పట్నుంచి ఆ దుండగులు విక్రమ్ జోషి పై కక్ష పెంచుకున్నారు. సోమవారం రాత్రి విక్రమ్ జోషి తన కూతురితో కలిసి బయటికొచ్చి తిరిగి ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యంలో కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో విక్రమ్ జోషి తలలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో స్థానిక యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. తన మేనకోడలిని వేధించిన పోకిరీలే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని విక్రమ్ జోషి సోదరుడు అనికేత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Related posts