మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రోజు రోజూకీ మరింత వేడెక్కుతున్నాయి. ఎన్నికలు సమయం దగ్గర పడుతున్నప్పట్టికీ కొత్త వివాదాలు, విమర్శలు తెరపైకి వస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి మా అధ్యక్ష పదవి కోసం పోటీ జరుగుతుంది. ఈసారి మా అధ్యక్ష పదవి కోసం ప్రకాష్ రాజ్, మంచు విష్ణు పోటీ పడుతుండడంతో ఎన్నికలు మరింత హీటెక్కాయి. రెండు ప్యానళ్ల మధ్య వివాదాలు, విమర్శలు ముదురుతున్నాయి.
తాజాగా తాజాగా కొత్త సమస్య తెరపైకి వచ్చింది. ‘మా’ ఎన్నికల్లో బ్యాలెట్ వినియోగంపై ప్రకాశ్రాజ్ ప్యానెల్ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అదే ఎన్నికల అధికారికి మంచు విష్ణు లేఖ రాశారు. ఈవీఎంలపై తమ ప్యానెల్ సభ్యులకు నమ్మకం లేదని, వాటిని ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందని ఆరోపించారు.
“అక్టోబర్ 10న జరిగే మా ఎన్నికలను బ్యాలెట్ విధానంలో నిర్వహించాలని మంచు విష్ణు లేఖలో కోరారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందని, ఈవీఎంలపై మా ప్యానెల్ సభ్యులకు నమ్మకం లేదని, పేపర్ బ్యాలెట్ విధానంలోనే ఈసారి మా పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల అధికారిని మంచు విష్ణు కోరారు.

ఈ విధానంలో జరిగే పోలింగ్లో పారదర్శకత ఉంటుంది. ఈవీఎంల కంటే పేపర్ బ్యాలెట్ చాలా ఉత్తమమైనది. బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పిస్తే సీనియర్లు చాలా మంది తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది” అని మంచు విష్ణు లేఖలో పేర్కొన్నారు.

