telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న నటి అనన్య నాగళ్ళ

Ananya

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమంలా ముందుకు సాగుతోంది. సినీ, రాజకీయ ప్రముఖులు సైతం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొంటున్నారు. ప్లే బ్యాక్ హీరో దినేష్ తేజ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు జూబ్లీహిల్స్ లోని పార్కులో మొక్కలు నాటారు ప్రముఖ హీరోయిన్ అనన్య నాగళ్ళ. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మారుతున్న వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరి బాధ్యతగా మొక్కలు నాటాలని రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే మంచి కార్యక్రమాన్ని చేపట్టారని, అందులో పాల్గొని మొక్కలు నాటడం నాకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా మరో ముగ్గురు అంజలి, నివేతా థామస్, ప్రియాంక జ్వలిత లకు ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ పాల్గొన్నారు.

Related posts