జీహెచ్ఎంసీ ఎన్నికల వేడి రాజుకుంటోంది. నిన్నటితో నామినేషన్ల పర్వం కూడా ముగిసిపోయింది. ఇప్పటికే అధికార, విపక్షాలు ప్రచారంలో బిజీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఇవాళ్టి నుంచి రంగంలోకి దిగనున్నారు. గతేడాది ఒంటి చెత్తో టీఆర్ఎస్ను గెలిపించాడు. అదే స్ఫూర్తితో నేటి నుంచి కేటీఆర్ రోడ్ షోలలో పాల్గొననున్నారు. మొదట కూకట్పల్లిలో రోడ్ షో నిర్వహించనున్నారు మంత్రి కేటీఆర్. ఇవాళ సాయంత్రం 4 గంటలకు కేటీఆర్ మొదటి రోడ్ షో ఉంటుంది. అనంతరం ఉప్పల్, కంటోన్మెంట్ లలో బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. కుత్బుల్లాపూర్లో కూడా ఇవాళ మంత్రి ప్రచారం చేయనున్నారు. ఆదివారం.. మహేశ్వరం, ఎల్బీ నగర్లో కేటీఆర్ రోడ్ షోలు నిర్వహించనున్నారు. ఇది ఇలా ఉంటే…గ్రేటర్లో గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ ముందుకు వెళుతోంది. ఈ మేరకు టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్స్ను అధిష్టానం ప్రకటించింది. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, తలసాని, ఈటల, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, కొప్పుల, పువ్వాడ అజయ్ పేర్లను హైకమాండ్ వెల్లడించింది.
previous post
next post