విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) నగరంలోని ట్రాఫిక్ కష్టాలను తీర్చడానికి కొత్త బస్టాండ్ నుండి స్క్రూ బ్రిడ్జ్ వరకు కొత్త ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి అన్నారు.
అభివృద్ధి పనులు జరుగుతుంటే సీపీఎం, సీపీఐ నాయకుల ధర్నాలు ఎందుకు? అని ప్రశ్నించారు.
బెంజ్ సర్కిల్ పరిసరాల్లో ఎంపీ కేశినేని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు.
ఈ ప్రాజెక్టును హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం (NH-65) విస్తరణ పనుల్లో భాగంగా చేర్చడానికి కసరత్తు జరుగుతోంది.
దీనికి సంబంధించి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి వివరణాత్మక నివేదిక (DPR) సమర్పించనున్నట్లు ఎంపీ తెలిపారు.


కేంద్రానికి కేసీఆర్ మద్దతు అవసరం లేకపోవడం సంతోషం: రేణుకా చౌదరి