telugu navyamedia
CBN రాజకీయ వార్తలు

ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది

ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేసింది.

జీఎల్ఐ, జీపీఎఫ్ కు చెందిన రూ. 6,200 కోట్లను విడుదల చేసింది. ఈ నిధులు నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. రేపు లేదా ఎల్లుండి సాయంత్రానికి పూర్తి స్థాయిలో నిధులు విడుదల అవుతాయి.

నిధుల విడుదలపై ఉద్యోగులు, ఎన్జీవో అసోసియేషన్ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల క్రితం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నిధుల విడుదలకు సంబంధించి ఆర్థికశాఖకు ఆదేశాలు జారీ చేశారు.

Related posts