నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ఇండియన్ నేవీలో జాబ్ నోటిఫికేషన్ విడుదలయింది. 2022 ఫిబ్రవరి బ్యాచ్ ద్వారా ఆర్టిఫిషర్ అప్రెంటీస్ (ఏఆర్), సీనియర్ సెకండరీ రిక్రూట్స్ (ఎస్ఎస్ఆర్) 2500 పోస్టులను భర్తీ చేయనుంది. పెళ్ళి కానీ పురుష అభ్యర్ధులు మాత్రమే ఈ అర్హత లభిస్తుంది. ఇంటర్ ఎంపీసీ గ్రూప్ చేసి ఉండాలి. రాత పరీక్ష హిందీ, ఇంగ్లిష్లో ఉంటుంది.
అభ్యర్థులను రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అనంతరం అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఆర్టిఫిషర్ అప్రెంటిస్ అభ్యర్థులకు 09 వారాలు, సీనియర్ సెకండరీ రిక్రూట్స్ అభ్యర్థులకు 22 వారాలు శిక్షణ ఉంటుంది.రాత పరీక్ష హిందీ, ఇంగ్లిష్లో ఉంటుంది.
నేవీలో ప్రధానంగా ఆఫీసర్స్, సెయిలర్స్, సివిలియన్స్ మూడు రకాల పోస్టులు ఉంటాయి. ఆఫీసర్స్ పోస్టులను యూపీఎస్సీ డిఫెన్స్ సర్వీస్, నేవల్ అకాడమీ ద్వారా భర్తీ చేస్తుండగా సెయిలర్స్, సివిలియన్స్ పోస్టుకు ఇండియన్ నేవీ విడిగా నోటిఫికేషన్స్ ఇస్తోంది. ప్రస్తుతం 2021 ఆగస్టు బ్యాచ్ ద్వారా సెయిలర్స్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది.
అర్హత కలిగిన వారు దరఖాస్తులు చేసుకునే చివరి తేది 25.10.2021 ఉంటుంది. పూర్తి వివరాలకు https://www.koinindiannavy.gov.in/ వెబ్సైట్ చూడొచ్చు.