టీ20 వరల్డ్ కప్లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో భారత జట్టు 61 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.
కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన టీమిండియా, టోర్నీలో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసి సూపర్-8 దశకు అర్హత సాధించింది
మొదటి ఇన్నింగ్స్లో ఇషాన్ కిషన్, రెండవ ఇన్నింగ్స్లో మనం చూసిన క్లినికల్ బౌలింగ్ అన్నీ తేడాను తెచ్చిపెట్టాయి.
మేము ఎల్లప్పుడూ డ్రైవర్ సీట్లో ఉండేవాళ్ళం. ఈ రాత్రి భారత్ అద్భుతంగా రాణించింది.
ఈ విజయంపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందిస్తూ భారత జట్టును ప్రశంసించాడు. “పవర్ప్లేలోనే భారత్ మ్యాచ్ను పాకిస్థాన్ నుంచి దూరం చేసినది.
తొలి ఇన్నింగ్స్లో ఇషాన్ కిషన్ బ్యాటింగ్, రెండో ఇన్నింగ్స్లో మన బౌలర్ల అద్భుత ప్రదర్శన మ్యాచ్లో తేడాను చూపాయి. భారత్ అదరగొట్టింది” అని సచిన్ టెండుల్కార్ ‘X’లో పోస్ట్ చేశాడు.
ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్, ఓపెనర్ ఇషాన్ కిషన్ (40 బంతుల్లో 77) మెరుపు ఇన్నింగ్స్తో భారీ స్కోరుకు పునాది వేసుకుంది.
తన ఇన్నింగ్స్లో కిషన్ 10 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ నిలకడగా రాణించడంతో, టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 175 పరుగుల స్కోరును నమోదు చేసింది. పాక్ బౌలర్లలో సైమ్ అయూబ్ 3 వికెట్లు తీశాడు.


“కాళేశ్వరం” కు జాతీయ హోదా దక్కకుండా చేసిన పాపం కాంగ్రెస్దే: మంత్రి హరీశ్ రావు