సింహాచల ఆలయంలో నెయ్యి కొనుగొళ్లపై అనుమానాలు. 2019 వరకు రూ.591కి కిలో నెయ్యి సరఫరా చేసిన విశాఖ డెయిరీ.
2022-23 మధ్య యూపీకి చెందిన ప్రీమియర్ సంస్థకు కాంట్రాక్ట్ అప్పగింత. కిలో రూ.393 చొప్పున 54 కిలోల ఆర్డర్ – 2023 – 24లో రూ.529 చొప్పున విశాఖకు చెందిన సంస్థ సరఫరా చేసింది.
2024-25లో రూ.344 చొప్పున రైతు డెయిరీ సరఫరా, అప్పుడు నాసిరకం నెయ్యి వాడుతున్నట్లు ఫిర్యాదులు.
ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. 27 డబ్బాలను తనిఖీల కోసం పంపించారు, తనిఖీల తరువాత నెయ్యిలో కల్తీ లేదంటూ రిపోర్టు లో తెలిపారు.
నెయ్యి నాణ్యతపై గోప్యత పాటించిన అధికారులు. ప్రస్తుతం కిలో రూ.650 చొప్పున సరఫరా చేస్తున్న సంఘం డెయిరీ. కల్తీ లేని నెయ్యి తక్కువ రేటు ధరకు వస్తుంటే అధిక ధరకు ఎందుకు కాంట్రాక్ట్ ఇచ్చారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


కమిటీల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం: కన్నా