గంటా శ్రీనివాస్ కు, ఎర్రగడ్డకు చెందిన దళిత సంఘాల నాయకుడు, దళిత రత్న అవార్డు లభించింది. బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో గంటా శ్రీనివాస్ తో పాటు పలువురికి దళిత రత్న అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా దళిత రత్న అవార్డు అందుకున్న గంటా శ్రీనివాస్ మాట్లాడుతూ దళితులకు సేవలనందిస్తున్న 200ల మందికి ఈ అవార్డులను అందజేశారని తెలిపారు. తెలంగాణ దళిత సేన గ్రేటర్ హైదరాబాద్ యువజన విభాగం అధ్యక్షుడిగా పనిచేస్తున్న తాను పలు దళిత సంఘాల్లో పదవులు నిర్వహించానన్నారు.
గంటా, తాను చేసిన సేవా కార్యక్రమాలను గుర్తించి తనకు ఈ అవార్డు అందించినందుకు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు రామ్ లక్ష్మణ్, ఆలిండియా దళిత సేన జాతీయ చైర్మన్ జె.బి.రాజు, తెలంగాణ రాష్ట్ర కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ గంటా మల్లేష్, దళిత సంఘాల నాయకులు మేడి పాపయ్య, దండు సురేందర్, ఆలె కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

