telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పద్నాలుగేళ్ల తర్వాత స్క్రీన్ పై సూర్య, జ్యోతిక జంట ?

Surya

పద్నాలుగేళ్ల తర్వాత వీళ్లిద్దరూ సిల్వర్ స్క్రీన్‌ మీద సూర్య, జ్యోతిక మళ్లీ కలిసి కనిపించనున్నారని టాక్‌ వినిపిస్తోంది. మలయాళ దర్శకురాలు అంజలీ మీనన్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుందట. తమిళ చిత్రం ‘సిల్లు కరుప్పాట్టి’ దర్శకురాలు హలితా షహీమ్‌తో కలసి అంజలీ మీనన్‌ కథ సిద్ధం చేస్తున్నారని కోలీవుడ్‌తో ప్రచారం జరుగుతోంది. దీనిపై ఈ జంట ఎలా స్పందిస్తారో మరి. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన జ్యోతిక ఇటీవలే మళ్లీ మేకప్ వేసుకుంటున్నారు. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు చేస్తూ తన సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలో సూర్య, జ్యోతిక మళ్లీ కలిసి నటిస్తే చూడాలన్నది కోలీవుడ్ ప్రేక్షకుల కోరిక. దీంతో వాళ్లిద్దరు ఎక్కడికెళ్లినా మళ్లీ కలిసి ఎప్పుడు నటిస్తున్నారు? అంటూ ప్రశ్నలు ఎదురవుతూనే ఉంటాయి. ‘కలిసి కనిపించాల్సిన కథ వస్తే మళ్లీ ఆన్‌స్క్రీన్‌ మీద జోడీగా కనబడతాం’ అని సూర్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పుడు ఆ టైమ్ వచ్చినట్లు కనిపిస్తోంది. ఇక గతంలో వెండితెరపై మోస్ట్ సక్సెస్‌ఫుల్ జంటగా గుర్తింపు పొందిన సూర్య, జ్యోతిక ప్రేమలో పడి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరూ కలిసి ఏడు సినిమాల్లో నటించారు.

Related posts