ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్ విజేతగా దివ్య దేశ్ముఖ్ నిలిచింది. ఈ రోజు జరిగిన ఫైనల్ మ్యాచ్లో కోనేరు హంపిపై దివ్య దేశ్ముఖ్ విజయం సాధించింది.
ఈ విజయంతో 19 ఏళ్ల దివ్య భారతదేశానికి చెందిన ఎనభై ఎనిమిదో గ్రాండ్ మాస్టర్గా అవతరించింది.
దివ్య దేశ్ముఖ్, కోనేరు హంపి మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో జరిగిన తొలి ర్యాపిడ్ ట్రై బ్రేకర్ డ్రాగా ముగిసింది. ఆ తర్వాత రెండో గేమ్లో మొత్తం 75 ఎత్తుల్లో కోనేరు హంపిపై దివ్య గెలుపొందింది.
2025 ఫిడే మహిళల ప్రపంచకప్ ఫైనల్స్కు చేరిన తొలి క్రీడాకారిణిగా దివ్య నిలిచింది. చివరకు విజేతగా నిలిచింది.
ఫైనల్ మ్యాచ్లో దివ్యకు 1.5 పాయింట్లు లభించగా, కోనేరు హంపికి 0.5 పాయింట్లు వచ్చాయి.
ఆదివారం జరిగిన మ్యాచ్లో దివ్యకు హంపీ గట్టి పోటీనిచ్చింది. దీంతో ఫలితం ట్రైబ్రేకర్కు చేరింది. సోమవారం దూకుడుగా ఆడిన దివ్య టోర్నీ విజేతగా నిలిచి గ్రాండ్ మాస్టర్ హోదాను దక్కించుకుంది.