telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2020 : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ..

ఐపీఎల్ 2020 లో ఈ రోజు మ్యాచ్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన ఢిల్లీ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఈ మ్యాచ్ పంజాబ్ కు చాలా ముఖ్యం. వారు ప్లే ఆఫ్ రేస్ లో ఉండాలంటే ఈ మ్యాచ్ తప్పకుండ గెలవాలి. ఒకవేళ ఢిల్లీ ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే వారికి ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం అవుతుంది. అయితే గాయం కారణంగా గత మ్యాచ్ కు దూరంగా ఉన్న ఢిల్లీ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తిరిగి జట్టులోకి వచ్చాడు. అది పంజాబ్ కు కొత్త నష్టం కలిగించే విషయమే అని చెప్పాలి. మరి ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేది చూడాలి.

ఢిల్లీ : పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్ (c), రిషబ్ పంత్ (w), షిమ్రాన్ హెట్మియర్, డేనియల్ సామ్స్, మార్కస్ స్టోయినిస్, అక్సర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, తుషార్ దేశ్‌ పాండే, కగిసో రబాడా

పంజాబ్ : కేఎల్ రాహుల్ (w/c), మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, నికోలస్ పూరన్, గ్లెన్ మాక్స్వెల్, దీపక్ హుడా, జేమ్స్ నీషమ్, మురుగన్ అశ్విన్, మహ్మద్ షమీ, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్

Related posts