ఏపీలోని మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్ని రామకృష్ణారెడ్డి ధ్వంసం చేసిన ఈవీఎంలో డేటా భద్రంగా ఉందని సీఈఓ ముకేశ్ కుమార్ మీనా తెలిపారు.
డేటా భద్రంగా ఉండడం వల్లే రీపోలింగ్ నిర్వహించలేదని వివరించారు. పోలింగ్ నాడు మాచర్లలో ఇలాంటివి 7 సంఘటనలు జరిగాయని వెల్లడించారు.
అందులో కొందరు ఈవీఎంలను ధ్వంసం చేసినట్లు వెబ్కాస్టింగ్ లో గుర్తించామని అన్నారు. సిట్ కు పోలీసులు అన్ని వివరాలు అందించారన్నారు.
20వ తేదీన రెంటచింతల ఎస్ఐ కోర్టులో మెమో దాఖలు చేయడంతో పాటు మొదటి నిందితుడిగా పిన్నెల్ని రామకృష్ణారెడ్డిని చేర్చారు అని ఎస్ఐ వెల్లడించారు.
పది సెక్షన్ల కింద పిన్నెల్నిపై కేసులు పెట్టినట్లు సీఈఓ వెల్లడించారు. ఆయనకు ఏడేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందన్నారు.

