తెలంగాణ రాష్ట్ర చిహ్నం తుది రూపుపై జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా చిహ్నం తుదిరూపుపై కళాకారుడు రుద్ర రాజేశంతో చర్చించారు. ప్రజల పోరాటం, త్యాగాలు ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నం రూపుదిద్దుకోనున్నట్లు తెలుస్తోంది.
జూన్ 2వ తేదీన అధికారిక చిహ్నంను రేవంత్ విడుదల చేయనున్నట్లు సమాచారం.
ఈ సమీక్ష సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, జేఏసీ నేత రఘు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు.


ట్రంప్ శిష్యుడు జగన్…