హెలికాప్టర్ ద్వారా తుపాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్న సీఎం చంద్రబాబు.
తుపాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న ఐదు జిల్లాల్లో ఆయన హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.
బాపట్ల, పల్నాడు, కృష్ణా, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ వ్యూ చేయనున్నారు.
చిలకలూరిపేట, పర్చూరు, చీరాల, బాపట్ల, కోడూరు, నాగాయలంక, కాట్రేనికోన, అంబాజీపేట, రాయవరం, ముదినేపల్లిలో సీఎం చంద్రబాబు ఏరియల్ వ్యూ చేయనున్నారు.
ఓడలరేవులో హెలికాప్టర్ దిగనున్నారు. కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవులో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు.
రోడ్డు మార్గంలో ప్రయాణించి వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను పరిశీలంచనున్న సీఎం చంద్రబాబు.
రైతులను పరామర్శించి, పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకుంటారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని అంచనా వేసి, ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన సహాయక చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.

