హైదరాబాద్లో బోనాల సందడి మొదలైంది. ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. గోల్కొండ కోటలో అమ్మవారి బోనాలతో పండుగ ప్రారంభమై, జూలై 24 వరకు కొనసాగుతుంది.
లక్షలాది మంది భక్తులు తరలిరానుండటంతో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొన్ని మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు, పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, సురక్షితంగా అమ్మవారిని దర్శించుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక వైభవానికి, భక్తి పారవశ్యానికి ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలు హైదరాబాద్ నగరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.
ముఖ్యంగా గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబ మహంకాళి ఆలయంలో జరిగే గోల్కొండ బోనాలతో ఈ పండుగ సందడి మొదలవుతుంది.
ఈ సంవత్సరం నేటి నుంచి (జూన్ 26)తొలి పూజతో ప్రారంభమైన మహంకాళి బోనాలు, జూలై 24వ తేదీ వరకు కొనసాగనున్నాయి.
ఈ విశేషమైన వేడుకలకు తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుండి కూడా లక్షలాది మంది భక్తులు నగరానికి చేరుకునే అవకాశం ఉంది.
ఈ భారీ రద్దీని దృష్టిలో ఉంచుకొని, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పటిష్టమైన ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు, ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లను ప్రకటించారు.
తద్వారా భక్తులకు, నగరవాసులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సురక్షితమైన వాతావరణాన్ని కల్పించనున్నారు.
జూన్ 26వ తేదీన తొలి పూజతో ప్రారంభమైన గోల్కొండ మహంకాళి బోనాలు, జూలై 24వ తేదీ వరకు కొనసాగుతాయి.
ఈ ఉత్సవాల సందర్భంగా ముఖ్యమైన తేదీలలో.. ముఖ్యంగా రద్దీ ఎక్కువగా ఉండే గోల్కొండ కోటకు వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉంటాయి.
ఈ మళ్లింపులు జూన్ 26, 29, జూలై 3, 6, 10, 13, 17, 20, 24 తేదీలలో వర్తిస్తాయి. వాహనదారులు ఉదయం 8 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ఈ క్రింది మార్గాలను అవాయిడ్ చేయాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

