కోలీవుడ్లో వెట్రిమారన్, ధనుష్ కాంబినేషన్ అంటేనే వైవిధ్యమైన సినిమాను తెరకెక్కిస్తారనే అంచనాలు బోలెడు ఉంటాయి. వీరి కాంబినేషన్లో ఇప్పుడు నాలుగో చిత్రం ‘అసురన్’ తెరకెక్కుతోంది. మలయాళ సీనియర్ నటి మంజు వారియర్ ఈ చిత్రం ద్వారా తమిళంలోకి అడుగుపెడుతున్నారు. ప్రకాశ్రాజ్, పశుపతి, పవన్, యోగిబాబు, ఆడుగలం నరేన్, తలైవాసల్ విజయ్, గురు సోమసుందరంలు ఇతర తారాగణం. దర్శకులు బాలాజీ శక్తివేల్, సుబ్రహ్మణ్య శివలు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటివరకు నటించిన పాత్రలకు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నారు ధనుష్.
ట్రైలర్ కూడా సినిమాపై ఆసక్తిని పెంచింది. అక్టోబరు 4వ తేదీన సినిమాను విడుదల చేయనున్నారు. తమిళనాడు, ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో మొత్తం వెయ్యికిపైగా థియేటర్లలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్రవర్గాలు తెలిపాయి. అమెరికాలో మాత్రమే 100 థియేటర్లలో సినిమాను విడుదల చేస్తున్నట్లు సమాచారం.