telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

రోహిత్ వేముల వ్యాఖ్యలపై మల్లు భట్టి విక్రమార్కకు బీజేపీ షాక్ – 25 లక్షల పరువు నష్టం నోటీసు

తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు షాక్ తగిలింది. రోహిత్ వేముల  ఆత్మహత్మపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు లీగల్ నోటీసులు పంపించారు.

బేషరతుగా మూడు రోజుల్లో క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.క్షమాపణలు చెప్పని పక్షంలో క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని.. 25 లక్షలకు పరువు నష్ట దావా వేస్తానని హెచ్చరించారు.

గతంలో కోర్టు ఇచ్చిన తీర్పు కాపీని బీజేపీ చీఫ్ తరపు అడ్వకేట్ అటాచ్ చేశారు.

Related posts