అనుష్క ప్రధాన పాత్రలో హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ప్రయోగాత్మక చిత్రం ‘నిశ్శబ్దం’. క్రితి ప్రసాద్ సమర్పణలో కోన ఫిల్మ్ కార్పోరేషన్ అసోసియేషన్తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను ఏప్రిల్ 2న విడుదల చేయాలని మొదట భావించారు. కానీ కరోనా మహమ్మారి కారణంగా ఆగిపోయింది. ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలని నిర్మాతలు మొదట భావించారు. కానీ, ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే అవకాశాలు లేవు. ఇప్పటికే కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలో విడుదలయ్యాయి. ఇక థియేటర్ రిలీజ్ కోసం వేచిచూడకుండా ‘నిశ్శబ్దం’ను నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నారు నిర్మాతలు. ఈ చిత్రాన్ని డిజిటల్ రైట్స్ను సైతం అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఈ మేరకు చిత్ర విడుదల తేదీని శుక్రవారం అమెజాన్ ప్రకటించింది. అక్టోబర్ 2న ఈ సినిమా వరల్డ్ ప్రీమియర్ ప్రసారం కానున్నట్టు అమెజాన్ వెల్లడించింది. చిత్ర విడుదల తేదీ ప్రకటన సందర్భంగా అనుష్క మాట్లాడుతూ.. ‘‘నేను ఇప్పటివరకు పోషించిన అన్ని పాత్రలలో సాక్షి పాత్ర నాకు చాలా కొత్తగా అనిపించింది. నా కంఫర్ట్ జోన్ నుండి నన్ను బయటకు నెట్టివేసిన పాత్ర ఇది. ఇలాంటి పాత్ర పోషించడం చాలా సంతోషంగా ఉంది.’’ అని అన్నారు. సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందిన ‘నిశ్శబ్దం’లో మాటలురాని, వినికిడి లోపం ఉన్న ఒక కళాకారిణిగా అనుష్క కనిపించనుంది. ఈ చిత్రంలో మాధవన్, అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు, శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రలు పోషించారు. హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడ్సన్ ఈ చిత్రం ద్వారా భారతీయ సినిమా అరంగేట్రం చేస్తున్నారు.
Your silence will protect you! 🤫#NishabdhamOnPrime, Oct 2! @PrimeVideoIN@ActorMadhavan #AnushkaShetty @yoursanjali @actorsubbaraju #ShaliniPandey @hemantmadhukar #TGVishwaPrasad @konavenkat99 @vivekkuchibotla @peoplemediafcy @KonaFilmCorp @GopiSundarOffl @MangoMusicTamil pic.twitter.com/PzJpHJ8xLA
— KonaFilmCorporation (@KonaFilmCorp) September 18, 2020
నైట్ ఫ్రీగా ఉంటావా ? 50 వేలు జీతం ఇస్తా అన్నారు : కరాటే కళ్యాణి