బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ఫుత్ మరణించి నెల రోజులైంది. గత నెల 14న ముంబయిలోని తన అపార్ట్మెంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు సుశాంత్. అయితే సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదని, ఎవరో ఆయనను హత్య చేశారని ఫ్యాన్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆయన మృతి కేసును సీబీఐకి అప్పగించాలని పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సుశాంత్ గర్ల్ఫ్రెండ్ రియా చక్రవర్తి కూడా ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కేంద్ర మంత్రి అమిత్ షా కోరారు.ఈ మేరకు ఓ ట్వీట్ వేసిన రియా.. ”అమిత్ షా సర్.. నేను సుశాంత్ గర్ల్ఫ్రెండ్ని. ఆయన మరణించి నెల రోజులు పూర్తైంది. ప్రభుత్వం మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది. సుశాంత్ మరణంపై న్యాయం కోసం సీబీఐ చేత విచారణ చేయించండి. సుశాంత్ ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను నేను తెలుసుకోవాలి” అని కామెంట్ పెట్టారు. అయితే సుశాంత్ మృతి కేసులో రియా పాత్ర ఉందంటూ ఫ్యాన్స్ మొదటి నుంచి కామెంట్లు చేస్తుండగా.. ఇప్పుడు ఆ నటినే సీబీఐ ఎంక్వైరీని కోరడం గమనార్హం.
previous post