దేశంలో లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. లాక్డౌన్ ఎత్తివేసే విషయం పై సీఎంల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. ముఖానికి మాస్కు ధరించి మోదీ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఒకవేళ లాక్డౌన్ ఎత్తివేస్తే దేశంలో ఏ విధమైన కొత్త సమస్యలూ రాకుండా చూడాలని మోదీ అన్నారు.
లాక్డౌన్ గడువు ఈ నెల 14తో ముగియనున్న నేపథ్యంలో ముఖ్యంగా ఈ విషయంపైనే చర్చిస్తున్నారు. అలాగే, కరోనా నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలు, తీసుకోవాల్సిన మరిన్ని అంశాలపై ఆయన మాట్లాడుతున్నారు.లాక్డౌన్ను పొడిగించాలా? వద్దా అన్న విషయంమై నేడు మోదీ ప్రకటన చేయనున్నారు. సీఎంలతో సమావేశం ముగిసిన అనంతరం లేక ఈ రోజు రాత్రి మోదీ జాతినుద్దేశించి మాట్లాడతారని తెలుస్తోంది.

