కరోనా వ్యాప్తి విజృంభిస్తున్న నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అయితే రేపు జరగాల్సిన పరీక్షను మాత్రం యదావిధిగా నిర్వహించాలని హైకోర్టు సూచించింది. ఈ నెల 23 నుంచి 30 వరకు జరగాల్సిన అన్ని పరీక్షలు రీషెడ్యూల్ చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 6 వరకు జరగాల్సిన అన్ని పరీక్షలపై పరిస్థితులను బట్టి తదుపరి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది.
తెలంగాణలో ఈ నెల 19 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. తెలుగుకు సంబంధించిన రెండు పేపర్లు పూర్తయ్యాయి.శనివారం హిందీ పేపర్ రాయాల్సి వుంది. రాష్ట్రవ్యాప్తంగా 2,530 కేంద్రాల్లో 5.34 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో పరీక్షలు కొనసాగించడంపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైన నేపథ్యంలో..అత్యవసరంగా కోర్టు విచారణ చేటట్టింది. ఈ మేరకు కోర్టు తీర్పు వెలువరించింది.
కేంద్రం హెచ్చరిస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు: సుజనా చౌదరి