బెంగళూరులో నిర్వహించిన ‘సేవ్ కాన్స్టిట్యూషన్’ కార్యక్రమంలో ఓ యువతి హల్ చల్ చేసింది. వేదిక ఎక్కి మైక్ వద్దకు వచ్చిన అమూల్య అనే యువతి ‘పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేసింది. ఈ మేరకు ఆ యువతి పై దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఆ సభలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఉన్నారు. అయితే ఆ మహిళ చేసిన నినాదాలకు తమకు సంబంధం లేదని ఎంపీ స్పష్టం చేశారు.
ఓవైసీతో పాటు మరో వ్యక్తి కూడా అప్పుడే ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆమె వద్ద నుంచి మైక్రోఫోన్ కూడా లాక్కున్నారు. సెడిషన్ సెక్షన్ 124ఏ, 153ఏ,బీల ప్రకారం ఆ యువతిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 24 ఏళ్ల వయసు గల అమూల్య లియోన్ బెంగుళూరులో జర్నలిజం కోర్స్ చేస్తుంది.