‘జిత్తన్’ ఫేమ్ రమేష్ కొంచెం గ్యాప్ అనంతరం మరో థ్రిల్లర్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. గోవాలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా దర్శకుడు ఎంవీ కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ శ్రద్ధాదాస్, బెంగాలీభామ ఇనా సహా హీరోయిన్లుగా ఎంపికయ్యారు. ఇంకా అజయ్ఘోష్, సనా, నితిక తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆనంద్ సంగీతం, వి.రవి సినిమాటోగ్రఫి అందిస్తున్నారు.
‘మిరట్చి’ గురించి దర్శకుడు మాట్లాడుతూ, ‘పూర్తిగా థ్రిల్లర్ కథతో రూపొందుతోంది. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. గోవాలో జరిగిన నిజ సంఘటనల ఆధారంగా కథ రాశాను. జిత్తన్ రమేష్ ఇప్పటి వరకు నటించని కొత్త పాత్రలో కనిపించబోతున్నాడు. క్లైమాక్స్ సన్నివేశాలను 3 రోజులు నిరవధికంగా షూటింగ్ జరిపి పూర్తి చేశాం. ఎంతో శ్రమపడి తెరకెక్కించిన ఆ సన్నివేశాలు వెండితెరపై సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి. అన్ని వర్గాల ప్రేక్షకుల ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాం’ అని చెప్పారు.