కృష్ణా జిల్లా నందిగామ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై ఆగివున్న డీసీఎంను కారు బలంగా ఢీకొంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు. మృతులు నందిగామకు చెందిన అరవింద్, దుర్గా, అనిల్, సాయిమనోజ్ లుగా గుర్తించారు. అధిక వేగంతో ప్రయాణిస్తూ, సెల్ ఫోన్ మాట్లాడడం ప్రమాదానికి దారితీసినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో కారు పూర్తిగా ధ్వంసమైంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేపట్టారు.