క్షణం, గూఢచారి వంటి అభిరుచి గల కథాంశాల్నిఎంచుకొని చక్కటి విజయాల్ని అందుకున్న అడవి శేష్ రీసెంట్గా మరోసారి థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన “ఎవరు” చిత్రంతో ప్రేక్షకులను థ్రిల్ చేశాడు. కెరీర్లో వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్న ఈ కుర్ర హీరో అడివి శేషు తాజాగా “మేజర్” అనే బయోపిక్లో నటిస్తున్నారు. 2008లో ముంబైలో జరిగిన టెర్రర్ అటాక్ లో ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ కమాండర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ మేజర్ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రం కోసం భారీ కండలు పెంచే పనిలో ఉన్నారు అడవి శేషు. జిమ్లో భారీ కసరత్తులు చేస్తూ, బాడీని పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా జిమ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దర్శకుడు శశి కిరణ్ తిక్క తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ నిర్మించడం విశేషం.
previous post
థూ.. దీనమ్మా జీవితం… ఆంటీ ఏంటి ? : పూరీ