మాజీ లోక్సభ ఎంపీ, సీపీఐ సీనియర్ నాయకుడు గురుదాస్ దాస్గుప్తా (83) కన్నుమూశారు. గతకొంత కాలంగా గుండె, కిడ్ని సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం కోల్కత్తాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
గురుదాస్ దాస్గుప్తా 1936 నవంబర్ 3న బారిసాల్లో జన్మించారు. తన జీవితంలో ట్రేడ్ యూనియన్ ఉద్యమాలతో సుదీర్ఘ అనుంబంధం కలిగిఉన్నారు. 1985లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2001లో ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక. 2004లో బంగాల్ పన్స్కురా లోక్సభ స్థానం నుంచి, అదేవిధంగా 2009లో ఘటల్ లోక్సభ స్థానం నుంచి ఆయన గెలుపొందారు. దాస్గుప్తా మరణంపై సీపీఐ జాతీయ కమిటీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది.


పోలవరంలో తగ్గించి ఎలక్ట్రిక్ బస్సుల్లో పెంచారు: లోకేశ్