దేశవ్యాప్తంగా గణేష్ చతుర్ధి ఉత్సవాలు నిన్నటితో ఘనంగా ముగిశాయి. ఊరు, వాడ, కులం, మతం అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు ఈ వేడుకని జరుపుకున్నారు. బాలీవుడ్ లో చాలామంది సెలెబ్రిటీలు ప్రతి ఏడాది గణేష్ ఉత్సవాలని ఘనంగా జరుపుకుంటారు. అందులో కండల వీరుడు సల్మాన్ ఖాన్, శిల్పాశెట్టి, షారూఖ్ ఖాన్ తదితరులు కూడా ప్రతి ఏడాది తమ ఇంట్లో గణేష్ చతుర్ధి పూజలు నిర్వహిస్తారు. తాజాగా షారుఖ్ తన ట్విట్టర్లో “పూజ పూర్తయింది …. నిమజ్జనం చేసాము. గణపతి బప్ప మొరియా !! ప్రపంచంలో ఉండే ఆనందంతో పాటు అంతకు మించిన ఆనందం ప్రతి ఇంటిలోకి మరియు ప్రతి కుటుంబంలోకి రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను” అని అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తో పాటు తమ ఇంట్లోని వినాయకుడి ఫోటోలను కూడా జతచేశారు. “జీరో” చిత్రం తర్వాత మరో సినిమా చేయని షారూఖ్ ప్రస్తుతం మంచి కథ కోసం ఎదురు చూస్తున్నాడు. అతి త్వరలోనే ఆయన తదుపరి ప్రాజెక్ట్కి సంబంధించి అనౌన్స్మెంట్ చేయనున్నట్టు సమాచారం.
Pooja done….Visarjan done. Ganpati Bappa Morya!! May the happiness of the world and beyond come into every household & for every family. pic.twitter.com/D8pKXtZk3K
— Shah Rukh Khan (@iamsrk) 12 September 2019