నేడు ప్రపంచ కప్ లో భాగంగా భారత్-పాక్ మ్యాచ్ ఉంది. అయితే వరుణుడు ఈ మ్యాచ్ జరగడానికి కరుణిస్తాడా లేదా అనేది సందేహంగానే ఉంది. అయినా కూడా అభిమానులు మాత్రం మ్యాచ్ పై అసలు కోల్పోకుండా, పూజలు చేస్తున్నారు. ప్రపంచకప్లో భాగంగా ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న భారత్ X పాక్ మ్యాచ్కు అంతా సిద్ధమైంది. మరికొద్దిసేపట్లో ఈ రెండు జట్లూ మెగా ఈవెంట్లో తలపడనున్నాయి. 1992 నుంచి 2015 వరకు ఆరుసార్లు ప్రపంచకప్లో తలపడగా టీమిండియానే విజయఢంకా మోగించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా భారత్ గెలవాలని కోట్లాది మంది భారత అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
కొందరు అభిమానులు టీమిండియా గెలుపు కోసం పూజలు చేస్తున్నారు. వారణాసిలో గంగానదికి హారతిచ్చి మరీ కోహ్లీసేన గెలవాలని ప్రార్థిస్తున్నారు. గోరఖ్పూర్ అభిమానులు ప్రత్యేక హోమం చేసి భారత్ గెలవాలని కోరుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లోనూ సందడి చేస్తున్నాయి. ఇదిలా ఉండగా ఉగ్రదాడుల కారణంగా రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు తెగిపోయిన సంగతి తెలిసిందే. గతకొన్నేళ్లుగా ఇరు జట్ల మధ్య దైపాక్షిక సిరీస్లు కూడా జరగడం లేదు. ఐసీసీ టోర్నమెంట్లలో పాల్గొన్నప్పుడే చిరకాల ప్రత్యర్థులు తలపడుతున్నారు.
రామ్ చరణ్ తో పెళ్లి తరవాత ట్రోల్స్ ఎక్కువయ్యాయి : ఉపాసన