ఓ విమానం ఏకంగా ఇంటిపై కూలిన కూలిన ఘటనలో ఆరుగురు మరణించారు. చిలీ దేశంలోని ఆర్చిపియోలాగోస్ ఎయిర్ కంపెనీకి చెందిన విమానం ప్రమాదవశాత్తూ ఓ ఇంటిపై కూలింది. ఈ ఘటనలో పైలెట్ తోపాటు ఐదుగురు ప్రయాణికులు మరణించారు.
ఈ ఘటనలో ఓ మహిళ కాళ్లు విరిగాయి. దీని తో గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించారు. విమాన ప్రమాదానికి కారణాలు తెలియరాలేదని ప్యూర్టో మాంట్ మేయరు హారీ జుర్గెన్ సన్ చెప్పారు. విమానం కూలిన ఇంట్లో ఎవరూ లేకపోవటంతో పెద్ద ప్రమాదం తప్పిందని మేయరు పేర్కొన్నారు.